పాటియాలా సెంట్రల్ జైలుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
శనివారం, 21 మే 2022 (09:51 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ పోలీసులు పాటియాలా కేంద్ర కారాగారానికి తరలించారు. మూడు దేశాబ్దాల క్రితం జరిగిన గొడవలో సిద్ధూ కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆయనకు యేడాది జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి దుస్తుల బ్యాగును తీసుకుని కోర్టుకు వెళ్లారు. 
 
ఆ తర్వాత నిబంధనల మేరకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులే సిద్ధూను పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లొంగిపోవడానికి మరికొద్ది రోజుల సమయం కావాలంటూ శుక్రవారం సిద్ధూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
 
ప్రత్యేక బెంచ్ ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్‌ను సమర్పించాలని, ఆయన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పింది. దీంతో సిద్ధూ కోర్టులోనే లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments