Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాటియాలా సెంట్రల్ జైలుకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ

Webdunia
శనివారం, 21 మే 2022 (09:51 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్ పోలీసులు పాటియాలా కేంద్ర కారాగారానికి తరలించారు. మూడు దేశాబ్దాల క్రితం జరిగిన గొడవలో సిద్ధూ కారును వేగంగా నడిపి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఆయనకు యేడాది జైలుశిక్ష విధించారు. ఈ నేపథ్యంలో ఆయన పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి దుస్తుల బ్యాగును తీసుకుని కోర్టుకు వెళ్లారు. 
 
ఆ తర్వాత నిబంధనల మేరకు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత పోలీసులే సిద్ధూను పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, లొంగిపోవడానికి మరికొద్ది రోజుల సమయం కావాలంటూ శుక్రవారం సిద్ధూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 
 
ప్రత్యేక బెంచ్ ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్‌ను సమర్పించాలని, ఆయన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పింది. దీంతో సిద్ధూ కోర్టులోనే లొంగిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments