Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష

నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష
, గురువారం, 19 మే 2022 (15:42 IST)
భారత మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 30 ఏండ్ల కిందటి ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.
 
1988 డిసెంబర్ 27న సిద్ధూ ఒక వాగ్వాదం సమయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు తుది తీర్పును గురువారం వెల్లడించింది.
 
ఈ ఘటనలో సిద్ధూపై ఐపీసీ సెక్షన్ 304ఏ కింద కేసు నమోదైంది. ఈ కేసు సెషన్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. పాటియాలాలోని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి 1999 సెప్టెంబర్ 22న ఈ కేసులో సాక్ష్యాధారాలు లేకపోవడంతో సిద్ధూ, అతని సహచరులను నిర్దోషులుగా ప్రకటించారు. 
 
దీనిపై బాధిత కుటుంబాలు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశాయి. 2006లో సిద్ధూను దోషిగా నిర్ధారిస్తూ ధర్మాసనం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన భారత అత్యున్నత న్యాయస్థానం ఏడాది జైలు శిక్షను విధిస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వామి నిత్యానంద జీవ సమాధి.. 20మందికి పైగా చికిత్స చేస్తున్నారట!?