Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డీఎంకే కార్యకర్త దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా?

murder
, శనివారం, 14 మే 2022 (19:22 IST)
తమిళనాడులో డీఎంకే కార్యకర్త హత్యకు గురయ్యారు. తమిళనాడు రాజధాని చెన్నై రాయపురంలోని గ్రేస్ గార్డెన్ మూడో వీధిలోని ఓ ఇంట్లో గోనె సంచిలో డీఎంకే కార్యకర్త చక్రపాణి (65) మృతదేహం కనిపించింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దాంతో పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టగా ఓ గోనె సంచిలో మనాలికి చెందిన చక్రపాణి మృతదేహం కనిపించింది. ఆ ఇల్లు అస్లాం హుస్సేనీ బట్చా (35), అతని భార్య ఎ. తమీమ్ బాను (40)కి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
 
నాలుగు రోజుల క్రితమే చక్రపాణిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన వివరాల ప్రకారం చక్రపాణి... తమీమ్‌తో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉన్నారని, ఆ జంట రాయపురానికి వెళ్లిన తర్వాత కూడా అది కొనసాగిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ క్రమంలో చక్రపాణిని హత్య చేశారని తెలిపారు. అస్లాం హుస్సేనీ సోదరుడు ఎం.వసీం బట్చా కూడా నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నారని చెప్పారు.
 
తమీమ్ మంగళవారం ఉదయం తన ఇంటికి రమ్మని మెసెజ్ చేయగా చక్రపాణి వెళ్లారని అదే సమయంలో తన స్నేహితుడు కె.డిల్లీ బాబుతో కలిసి ఇంటికి వెళ్లిన వసీం... తమీమ్, చక్రపాణీలను చూసి గొడవ పడి.. చక్రపాణిని హత్య చేసినట్టు తాము అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
 
ఈ క్రమంలో వసీం, ఢిల్లీ బాబు పరారీలో ఉండగా.. అస్లాం హుస్సేనీ, తమీమ్ బానులకు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాయపురం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ జీహెచ్‌కి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమృత్‌సర్‌ గురునానక్ దేవ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం