Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఏకమైన రైతు సంఘాలు - 24న ఆందోళన

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (09:44 IST)
త్రివిధ దళాల్లో సాయుధ బలగాల నియామకం కోసం కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరుద్యోగులతోపాటు విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పథకానికి నిరసనగా సోమవారం భారత్ బంద్ కూడా నిర్వహించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ రైతు సంఘాల ప్రతినిధులు కూడా స్పందించాయి. 
 
ఈ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24వ తేదీన దేశ వ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ తెలిపారు. 
 
జిల్లా, తాహసీల్దారు కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు, రాకేష్ టికాయత్ సారథ్యంలోని బీకేయూ కూడా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన దేశ వ్యాప్త నిరసలనకు పిలుపునిచ్చిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments