Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు కూడా ఈడీ విచారణకు హాజరుకానున్న సోనియా

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:41 IST)
నేషనల్ హెరాల్డ్ పత్రికకు చెందిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కాంగ్రెస్ అధినేతల వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఇందులోభాగంగా, ఇప్పటికే కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వద్ద విచారణ జరిపిన ఈడీ అధికారులు ఇపుడు ఆయన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద విచారణ జరుపుతున్నారు. 
 
ఇప్పటికే తొలి దఫాలో 3 గంటలు, రెండో దఫాలో 6 గంటల పాటు విచారణ జరిపారు. మూడో దఫాగా బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు సమన్లు ఇచ్చారు. దీంతో బుధవారం కూడా ఆమె హాజరుకానున్నారు. 
 
నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో సోనియా గాంధీ వద్ద ఈడీ అధికారులు తొలిసారి ఈ నెల 21వ తేదీన విచారణ జరిపిన విషయం తెల్సిందే. రెండు దఫాలుగా జరిపిన విచారణలో సోనియా వద్ద మొత్తం 9 గంటల పాటు విచారణ సాగింది. 
 
మరోవైపు, ఈ కేసులో రాహుల్, సోనియాల వద్ద ఈడీ అధికారులు విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలోని ఈడీ కార్యాలయంతో పాటు ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీస్ బలగాలను మొహరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments