Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీ చేశాడన్న అనుమానంతో విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:32 IST)
తమ వాచ్‌ను చోరీ చేశాడన్న అనుమానంతో ఓ విద్యార్థిని కొందరు విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దిల్షన్ అలియాస్ రాజా అనే 15 యేళ్ల బాలుడు ఈ నెల 23వ తేదీ ఇంటర్ అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లాడు. అక్కడ నుంచి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఇంతలో ఆ కాలేజీలో పని చేసే శివకుమార్ యాదవ్ అనే ఉపాధ్యాయుడి వాచ్ కనిపించలేదు. ఈ వాచీని రాజానే దొంగిలించివుంటాని బలంగా నమ్మాడు. ఆ తర్వాత రాజాను కాలేజీకి పిలిపించి, సహ ఉపాధ్యాయులు ప్రభాకర్, వివికే యాదవ్‌లతో కలిసి శివకుమార్ యాదవ్ తీవ్రంగా కొట్టాడు. 
 
ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన రాజా అక్కడే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని హుటాహుటిన కాన్పూరు ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments