Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీ చేశాడన్న అనుమానంతో విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:32 IST)
తమ వాచ్‌ను చోరీ చేశాడన్న అనుమానంతో ఓ విద్యార్థిని కొందరు విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దిల్షన్ అలియాస్ రాజా అనే 15 యేళ్ల బాలుడు ఈ నెల 23వ తేదీ ఇంటర్ అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లాడు. అక్కడ నుంచి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఇంతలో ఆ కాలేజీలో పని చేసే శివకుమార్ యాదవ్ అనే ఉపాధ్యాయుడి వాచ్ కనిపించలేదు. ఈ వాచీని రాజానే దొంగిలించివుంటాని బలంగా నమ్మాడు. ఆ తర్వాత రాజాను కాలేజీకి పిలిపించి, సహ ఉపాధ్యాయులు ప్రభాకర్, వివికే యాదవ్‌లతో కలిసి శివకుమార్ యాదవ్ తీవ్రంగా కొట్టాడు. 
 
ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన రాజా అక్కడే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని హుటాహుటిన కాన్పూరు ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments