Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీ చేశాడన్న అనుమానంతో విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు...

Webdunia
బుధవారం, 27 జులై 2022 (08:32 IST)
తమ వాచ్‌ను చోరీ చేశాడన్న అనుమానంతో ఓ విద్యార్థిని కొందరు విచక్షణా రహితంగా కొట్టి చంపేశారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, ఈ గ్రామానికి చెందిన దిల్షన్ అలియాస్ రాజా అనే 15 యేళ్ల బాలుడు ఈ నెల 23వ తేదీ ఇంటర్ అడ్మిషన్ కోసం కాలేజీకి వెళ్లాడు. అక్కడ నుంచి తన పని ముగించుకుని ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఇంతలో ఆ కాలేజీలో పని చేసే శివకుమార్ యాదవ్ అనే ఉపాధ్యాయుడి వాచ్ కనిపించలేదు. ఈ వాచీని రాజానే దొంగిలించివుంటాని బలంగా నమ్మాడు. ఆ తర్వాత రాజాను కాలేజీకి పిలిపించి, సహ ఉపాధ్యాయులు ప్రభాకర్, వివికే యాదవ్‌లతో కలిసి శివకుమార్ యాదవ్ తీవ్రంగా కొట్టాడు. 
 
ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన రాజా అక్కడే అపస్మారకస్థితిలోకి జారుకున్నాడు. దీంతో అతన్ని హుటాహుటిన కాన్పూరు ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుల దెబ్బలతో తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి కన్నుమూశాడు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కున్వర్ అనుపమ్ సింగ్ స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments