భారతదేశ యువత వారానికి 70 గంటలు పని చేయాలి : 'ఇన్ఫోసిస్' నారాయణ మూర్తి

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (09:31 IST)
భారతదేశ యువత వారానికి 70 గంటల పాటు పని చేయాలని 'ఇన్ఫోసిస్' సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పిలుపునిచ్చారు. ఇతర దేశాలతో పోటీపడేందుకు భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
'3వన్4 క్యాపిటల్ తొలి పాడ్‌కాస్ట్ ది రికార్డ్' అనే ఎపిసోడ్‌లో నారాయణ మూర్తి పాల్గొని మాట్లాడుతూ, ఇతర దేశాలతో సమానంగా భారత్ అభివృద్ధి సాధించాలంటే భారతదేశ పని సంస్కృతిలో తక్షణ మార్పులు రావాలని కోరారు. యుతవ కష్టపడేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. వారానికి 70 గంటల పాటు పని చేయాలని ఆయన సూచించారు. 
 
ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువగా ఉందని నారాయణ మూర్తి తెలిపారు. రెండే ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ దేశాలు తమ పని సంస్కృతిలో మార్పులు చేసుకున్నాయని, యువత అధిక సమయం పనికి కేటాయించేలా ప్రోత్సహించాయని ఆయన గుర్తు చేశారు. చైనా వంటి దేశాలతో పోటీపడేందుకు ఇది అవసరమని ఆయన చెప్పారు. "ఇది నా దేశం. నా దేశం కోసం వారానికి 70 గంటలు కష్టపడతాను" అని యువత ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments