Webdunia - Bharat's app for daily news and videos

Install App

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

ఠాగూర్
బుధవారం, 11 జూన్ 2025 (18:53 IST)
మేఘాలయ హనీమూన్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సోదరుడు గోవింద్ రఘువంశీ స్పందించారు. ఆయన బుధవారం మృతుడు రాజా రఘువంశీ తల్లితో పాటు కుటుంబ సభ్యులను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా సోనమ్‌తో అన్న సంబంధాలు తెంచుకుందని ప్రకటించారు. ఒకవేళ సోనమ్ దోషి అని తేలితే ఉరితీయాలని సోదరుడు గోవిద్ రఘువంశీ డిమాండ్ చేశారు. 
 
బుధవారం ఇండోర్‌లోని రాజా రఘువంశీ నివాసానికి వెళ్లిన గోవింద్, రాజా తల్లి ఉమా రఘువంశీని ఆలింగనం చేసుకుని బోరున విలపించారు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని కలిచివేశాయి. మే 11వ తేదీన వివాహం చేసుకున్న సోనమ్ (24), రాజా (29) నవ దంపతులు హనీమూన్‌కి వెళ్లగా పెళ్లయిన 12 రోజులకే మే 23వ తేదీన రాజా హత్యకు గురయ్యారు. 21 యేళ్ల రాజ్ కుశ్వాహాతో సోనమ్ ప్రేమ వ్యవహరం ఉందని, అతడి స్నేహితుల సహాయంతో ఈ హత్యకు కుట్ర పన్నా రని పోలీసులు విచారణలో వెల్లడైంది. సోనమ్ ఇప్పటికే నేరం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఆ తర్వాత రాజా సోదరుడు విపిన్‌తో కలిసి ప్రతినిదులతో మాట్లాడిన గోవింద్... "సోనమ్ ఈ హత్య వెనుక ఉందని ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ, బయటకు వస్తున్న సాక్ష్యధారాలు చూస్తుంటే, ఆమెనే ఈ దారుణం చేయించిందనిపిస్తోంది. ఈ కేసులో వినిపిస్తున్న మిగతా నిందితుల పేర్లన్నీ రాజ్ కుష్వాహాకు సంబంధించినవే" అని తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments