Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్‌తో భర్త చనిపోతే.. భార్య ఏడేళ్ల కుమారుడితో 12వ అంతస్థు నుంచి..?

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (21:31 IST)
కోవిడ్ సోకి భర్తను కోల్పోయిన మహిళకు ధైర్యం చెప్పాల్సింది పోయి ఇరుగు పొరుగువారు వేధింపులకు గురిచేశారు. సూటీ పోటీ మాటలతో మానసికంగా హింసించారు. అన్నింటిని భరిస్తూ ఏడు సంవత్సరాల కొడుకుతో ఇంట్లోనే కుమిలిపోతూ బతుకుతోందా అభాగ్యురాలు.

కానీ ఇరుగుపొరుగువారు ఆమెను కాకుల్లా పొడుచుకుతిన్నారు. వేధింపులకు గురిచేశారు. వారి వేధింపులకు తాళలేక తన కుమారుడుతో పాటు 12వ అంతస్థు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఓ మహిళ అత్యంత దీన గాథ ముంబైలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే ముంబైలోని చండీవాలిలో నహరే అమృత్ శక్తి నివాస్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న రేష్మా ట్రెంచిల్‌ అనే మహిళ భర్త శరత్ కరోనా సోకి చికిత్స పొందుతూ మే 23న మరణించాడు. ఆమె భర్త వ్యవసాయ కోసం ఉపయోగించే పనిముట్లను ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌కు చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పనిచేసేవాడు. తనను కొడుకుని ఎంతో అపురూపంగా చూసుకునే భర్త తలచుకుని ట్రెంచిల్ కుమిలిపోయింది. ఆ బాధనుంచి తేరుకోలేకపోతోంది. 
 
కానీ కొడుకు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ట్రెంచిల్‌ తన ఏడేళ్ల కుమారుడితో కలిసి ఒంటరిగా బతుకుతోంది. ఆమెతో ఇరుగుపొరుగు వారు వేధింపులకు గురిచేశారు. కరోనా వుందేమోనని వేధించారు. దీంతో కుమిలిపోయిన ఆమె తన కుమారుడితో కలిసి తాను ఉంటున్న అపార్టమెంట్‌లోని 12వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
 
పొరుగింట్లో ఉండే వ్యక్తి తనను వేధిస్తున్నారనీ.. ప్రతి దానికి తనతో గొడవపడుతున్నాడని..వారి వేధింపులు తట్టుకోలేకే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్నారు. దానిలో ఉన్న దాని ప్రకారం ట్రెంచిల్‌ పొరుగింటి వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments