Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తలుపులు మూయడం మర్చిపోయి ప్రియుడితో ఆంటీ ఎంజాయ్, ఉన్నట్లుండి కొడుకు ఎంట్రీ

Advertiesment
తలుపులు మూయడం మర్చిపోయి ప్రియుడితో ఆంటీ ఎంజాయ్, ఉన్నట్లుండి కొడుకు ఎంట్రీ
, మంగళవారం, 22 జూన్ 2021 (15:15 IST)
వివాహేతర సంబంధం కాస్త ఒక చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. అభంశుభం తెలియని పదేళ్ళ చిన్నారి అతి దారుణంగా హత్యకు గురయ్యాడు. తమ అక్రమ సంబంధం బయటపడిపోతుందేమోనన్న భయంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు యువకుడు. 
 
బీహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లాలోని బరూరాజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీనియా గ్రామంలో నివాసమున్న 45 యేళ్ళ సిమ్రాన్‌కు 15 యేళ్ళ క్రితమే వివాహమైంది. పదేళ్ళ కుమారుడు ఉన్నాడు. సిమ్రాన్ అందంగా ఉంటుంది. సిమ్రాన్ కొడుకు నీరజ్. సిమ్రాన్ భర్త స్థానికంగా వ్యాపారవేత్త. 
 
దీంతో పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉండేవాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న సంజయ్ పండిట్ అనే 30 యేళ్ళ యువకుడితో సిమ్రాన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వ్యాపారం నిమిత్తం బయటకు భర్త వెళితే ప్రియుడిని ఇంట్లోనే పిలిపించుకుని ఎంజాయ్ చేసేది సిమ్రాన్.
 
కొడుకును మాత్రం ఆ సమయంలో ఆడుకునేందుకు బయటకు పంపేసేది. ఎప్పటిలాగే రెండురోజుల క్రితం కూడా భర్త బయటకు వెళ్లడం.. కొడుకుని ఆడుకోవడానికి పంపించి ప్రియుడితో ఎంజాయ్‌కు సిద్దమైంది. అయితే తలుపులు వేసుకోవడం మర్చిపోవడంతో కొడుకు ఇంట్లోకి సడెన్ వచ్చాడు. అమ్మను, కొత్త వ్యక్తిని బెడ్ పైన అశ్లీలంగా చూశాడు. 
 
దీంతో భయంతో ఎక్కడ తండ్రికి విషయం చెప్పేస్తాడేమోనని ఆ తల్లి ప్రియుడితో కలిసి అతడిని కిడ్నాప్ చేయించింది. ఒకరోజు పాటు ఇంట్లో లేకపోవడంతో మొన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు తండ్రి. భార్యపై అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఆమెను అదుపులోకి తీసుకోగా అసలు విషయాన్ని చెప్పేసింది. కానీ ప్రియుడు ఆ చిన్నారిని అతి దారుణంగా చంపేసి పరారయ్యాడు. నిందితుడు పరారీలో ఉండగా నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల వస్త్రధారణపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెత్త కామెంట్స్