Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకప్‌ గదిలో జూ.ఆర్టిస్టుపై అత్యాచారం... టీవీ నిర్మాతకు జైలుశిక్ష

మేకప్ గదిలో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసు బుల్లితెర నిర్మాతకు జైలుశిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక మహిళా కోర్టు తీర్పునువెలువరించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (11:50 IST)
మేకప్ గదిలో జూనియర్ ఆర్టిస్టుపై అత్యాచారం చేసిన కేసు బుల్లితెర నిర్మాతకు జైలుశిక్ష విధిస్తూ ముంబై ప్రత్యేక మహిళా కోర్టు తీర్పునువెలువరించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే...
 
ముంబైకు చెందిన ముకేశ్ మిశ్రా (33) అనే వ్యక్తి గత 2012 సంవత్సరంలో 'ఏక్ వీర్ కీ అరదాస్ వీర్' అనే టీవీ షోకు నిర్మాతగా ఉన్నారు. ఈ షోలో ఓ జూనియర్ ఆర్టిస్ట్ నటించింది. ఈమె వయసు 33 యేళ్లు. అయితే, ఉదయాన్నే షూటింగ్ ఉందని, తక్షణం షూటింగ్ స్పాట్‌కు రావాలంటూ కబురు పెట్టాడు. 
 
దీంతో ఆమె ఆదరాబాదరాగా బస్టాపుకు చేరుకోగా, అప్పటికే అక్కడ వేచివున్న ముకేశ్.. బస్సులో వెళితే లేట్ అవుతుందని చెప్పి తన బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. షూటింగ్ స్పాట్‌లోని మేకప్ రూముకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. విషయం ఎవరికైనా చెబితే కూతురిని చంపేస్తానని బెదిరించాడు. ఆపై పలుమార్లు ఇదేవిధంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అతని వేధింపులు తాళలేకపోయిన బాధితురాలు, 2013లో భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణ ముంబై ప్రత్యేక మహిళా కోర్టులో ఐదేళ్లపాటు సాగింది. ఈ విచారణలో ముకేశ్ దోషేనని న్యాయస్థానం తేల్చి, ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల అపరాధం విధిస్తూ తీర్పునిచ్చింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments