Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ భర్తలతో సంబంధం పెట్టుకుందనీ.. ఇద్దరు భార్యల ఘాతుకం

తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (11:41 IST)
తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లగూర శాంతి (29) అనే వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం పలువురు గ్రామస్థులకు కూడా తెలుసు. ఈ విషయంపై ఆమె చర్యను పలువురు గ్రామస్థులు కూడా ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె గురువారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇంటి గోడకు ఉన్న రాతి దూలానికి నవారుతో వేలాడుతూ ఉండటాన్ని ఆమె కుమార్తె జ్యోతి గురువారం సాయంత్రం 5.00 గంటల సమయంలో గమనించి కేకలు వేసింది. 
 
దీనితో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను శాంతిని కిందకు దించి చూడగా ఆమె అప్పటికే మృతిచెందింది. ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే, శాంతి మృతిపై బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరితో శాంతికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో వారి భార్యలే హత్య చేసి ఉంటారని బంధువులు, భర్త ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం శాంతి ఒంటరిగా ఉండగా ఆ ఇద్దరి భార్యలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments