Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమ భర్తలతో సంబంధం పెట్టుకుందనీ.. ఇద్దరు భార్యల ఘాతుకం

తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (11:41 IST)
తమ భర్తలతో ఓ మహిళ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరు భార్యలు కలిసి కొట్టి చంపేశారు. ఈ దారుణం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీకి చెందిన పుల్లగూర శాంతి (29) అనే వివాహిత అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం పలువురు గ్రామస్థులకు కూడా తెలుసు. ఈ విషయంపై ఆమె చర్యను పలువురు గ్రామస్థులు కూడా ఖండించారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె గురువారం సాయంత్రం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఇంటి గోడకు ఉన్న రాతి దూలానికి నవారుతో వేలాడుతూ ఉండటాన్ని ఆమె కుమార్తె జ్యోతి గురువారం సాయంత్రం 5.00 గంటల సమయంలో గమనించి కేకలు వేసింది. 
 
దీనితో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను శాంతిని కిందకు దించి చూడగా ఆమె అప్పటికే మృతిచెందింది. ఆ తర్వాత సమాచారాన్ని పోలీసులకు చేరవేయడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
అయితే, శాంతి మృతిపై బంధువులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరితో శాంతికి వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో వారి భార్యలే హత్య చేసి ఉంటారని బంధువులు, భర్త ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం శాంతి ఒంటరిగా ఉండగా ఆ ఇద్దరి భార్యలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments