Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకాన్ని హింసించిన ముంబై కిరాతకుల అరెస్టు...

Webdunia
మంగళవారం, 26 మే 2020 (08:58 IST)
టిక్ టాక్ వీడియో కోసం ఓ శునకాన్ని హింసించి, చంపేని ఇద్దరు యువకులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ ఇద్దరు యువకుల ఆచూకీ తెలిపితే రూ.50 వేల నజరానా ఇస్తామని జంతు పరిరక్షణ సంస్థ పెటా ఓ ట్వీట్ చేసింది. పైగా, ఈ యువకుడు పోస్ట్ చేసిన వీడియో సైతం వైరల్ కావడంతో ఆ కిరాతకులను కఠింగా శిక్షించాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకులను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిలో అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఇద్దరు యువకులు ఓ శునకం కాళ్లను తాడుతో కట్టి దానిని ఇద్దరూ పట్టుకుని పెద్ద మురికిగుంటలోకి విసిరేస్తూ వీడియో తీశారు. అంతేకాదు, అది బయటకు తేలకుండా ఒడ్డు నుంచి పెద్ద రాళ్లతో దానిని కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో దుమారం రేగింది.
 
శునకాన్ని హింసించి చంపిన వారిని పట్టుకుని శిక్షించాలంటూ నెట్టింట డిమాండ్లు వెల్లువెత్తాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు సునీల్ శెట్టి, హీనా సిద్ధు వంటి వారు కూడా ఈ వీడియోపై స్పందించారు. ఈ వీడియోను చూసిన 'పెటా' తీవ్రంగా స్పందించింది. శునకాన్ని హింసించిన వారిని పట్టుకుని అప్పగిస్తే రూ.50 వేలు ఇస్తామని ప్రకటించింది.
 
అదేసమయంలో పోలీసులు కూడా వేట సాగించారు. చివరికి ఉజ్జయినిలో వీరు పోలీసులకు చిక్కారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులు ముంబైకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకడు సన్నీ బొరాస (19) కాగా, మరొకడు బాలుడు. వీరిని పట్టుకున్న వాళ్లకు 'పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్' (పెటా) రూ.50 వేల రివార్డును కూడా ప్రకటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments