Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రసవానికి డబ్బుల్లేక దొంగతనం చేశాడు.. హత్య కూడా చేశాడు.. చివరికి?

Webdunia
సోమవారం, 5 ఏప్రియల్ 2021 (16:20 IST)
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య ప్రసవానికి డబ్బు లేక ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య ప్రసవానికి చేతిలో డబ్బుల్లేక అతడు హంతకుడిగా మారాడు. వివరాల్లోకి వెళితే.. షేక్‌ అనే వ్యక్తి భార్య గర్భంతో ఉంది. 
 
ఆమె ప్రసవానికి డబ్బు లేకపోవడంతో చోరీ చేయాలని భావించాడు. ఇందు కోసం ట్రైన్ ఎక్కాడు. ట్రైన్‌లో జైశ్వాల్ కుర్లా అనే వ్యక్తి పర్సును దొంగలించాడు. అతడు ఎక్కడ ఈ విషాయాన్ని పోలీసులకు చెప్తాడో అనే భయంతో అతడిని కత్తితో పొడిచి హత్య చేశాడు.
 
ట్రైన్‌లో జరిగిన ఈ దారుణ ఘటనపై పోలీసులు సీసీ పుటేజ్ ఆధారంగా విచారించి నిందితుడిని పట్టుకున్నారు. విచారణలో షేక్ చెప్పిన విషయం పోలీసులను షాక్‌కు గురి చేసింది.

తన భార్య ప్రసవానికి డబ్బు లేకే ఈ పని చేశానని ఒప్పుకున్న హంతకుడు దొంగిలించిన పర్సులో కేవలం రూ. 70 మాత్రమే ఉన్నాయని తెలిపాడు. 70 రూపాయల కోసం ఓ నిండు ప్రాణం తీసి జైలు పాలయ్యాడు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments