Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తెతో సంబంధం.. యువకుడిని చిత్ర హింసలు పెట్టిన తండ్రి.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (12:42 IST)
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో దారుణం జరిగింది. తన కుమార్తెతో సంబంధాన్ని కలిగి ఉన్నాడన్న అక్కసుతో యువతి తండ్రి దారుణానికి ఒడిగట్టారు. యువకుడి మర్మాంగాలపై దాడిచేసి చిత్రహింసలకు గురి చేశారు. 
 
వివరాల్లోకి వెళ్తే ముంబైలో ఓ యువతితో 18 ఏళ్ల ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ అనే యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు. అయితే తన కుమార్తెకు దూరంగా ఉండాలని తండ్రి పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆ యువకుడు మాత్రం ఆ యువతిని వదల్లేదు. దీంతో యువతి తండ్రి 30 మందితో కలిసి యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.
 
యువకుడి రహస్య భాగాలపై కత్తి, రాడ్‌లతో దాడి చేశాడు. ఆ తర్వాత కొండపై నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత కోలుకున్న ఓవైస్ అబ్దుల్ రహీం ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. జనవరి 23న జరిగిన ఈ ఘటన తర్వాత ప్రాణాలతో బయటపడినట్లు చెప్పుకొచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రే ఈ కేసులో ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. 
 
తన కుమార్తెతో కలిసి ఉండకూడదని.. సంబంధం కొనసాగించొద్దని ఎన్నోసార్లు హెచ్చరించినప్పటికీ యువకుడు పట్టించుకోలేదని పోలీసులు తెలిపారు. అందువల్లే దాడి జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 30మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments