Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. ఆపై చంపేసి శవాన్ని పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడేశాడు...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:47 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేసి.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడేశారు. ఈ ఘటన ముంబైలోని నెహ్రూ నగర్ విలే పార్లా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జుహూ పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు.. ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇంతలో స్థానికంగా ఉండే ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో బాలిక మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా చేయించారు. 
 
ఈ శవపరీక్షలో బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తేలింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్‌ కేసులతో పాటుగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments