Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం.. ఆపై చంపేసి శవాన్ని పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడేశాడు...

Webdunia
సోమవారం, 8 ఏప్రియల్ 2019 (11:47 IST)
మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు తొమ్మిదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలికను హత్య చేసి.. పబ్లిక్ టాయ్‌లెట్‌లో పడేశారు. ఈ ఘటన ముంబైలోని నెహ్రూ నగర్ విలే పార్లా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెహ్రూ నగర్‌లోని చాల్‌కు చెందిన బాలిక గురువారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు జుహూ పోలీస్‌ స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి పోలీసులు.. ఆ బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
 
ఇంతలో స్థానికంగా ఉండే ఓ పబ్లిక్ టాయ్‌లెట్‌లో బాలిక మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా చేయించారు. 
 
ఈ శవపరీక్షలో బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు తేలింది. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశాం. అతడిపై హత్యా, అత్యాచార, కిడ్నాప్‌ కేసులతో పాటుగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments