మహారాష్ట్రకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా.. ముఖేష్ ఉదారత

Webdunia
గురువారం, 15 ఏప్రియల్ 2021 (18:09 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కరోనా కష్టకాలంలో తన ఉదారతను చాటుకున్నారు. మహారాష్ట్రలో కరోనా సునామీ కొనసాగుతోంది. దీంతో ఆస్పత్రులతో పాటు.. ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. 
 
ఈ తరుణంలో తమ చమురుశుద్ధి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు నిర్ణయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీ ప్లాంటును రిలయన్స్ నిర్వహిస్తోంది. గుజరాత్‌లోని జామ్ నగర్‌లో ఉన్న తమ రిఫైనరీలో ఉత్పత్తి అవుతున్న ఆక్సిజన్‌ను మహారాష్ట్రకు ఉచితంగా అందించనున్నట్టు రిలయన్స్ ప్రకటించింది.
 
ఈ విషయాన్ని మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే కూడా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే రిలయన్స్ నుంచి 100 టన్నుల ఆక్సిజన్ మహారాష్ట్రకు వస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆసుపత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయి. ఆక్సిజన్ సరిపోక రోగులు ఇబ్బంది పడుతున్నారు. కరోనా కట్టడి కోసం మహా ప్రభుత్వం జనతా కర్ఫ్యూ కూడా విధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bala Saraswati Devi : రావు బాలసరస్వతి గారు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్

Priyadarshi: ఏమీ చేయలేకపోతోన్నప్పుడు నెగెటివ్ కామెంట్లను చేస్తుంటారు : ప్రియదర్శి

గోపి గాళ్ల గోవా ట్రిప్.. కాన్సెప్ట్ చిత్రాలకు సపోర్ట్ చేయాలి : సాయి రాజేష్

Sudheer Babu: జటాధార తో సుధీర్ బాబు డాన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తాడా...

Prabhas : రెబల్‌స్టార్ ప్రభాస్ సాలార్ రి రిలీజ్ కు సిద్దమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments