Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య చేతిని నరికిన కసాయి.. పెళ్లైన రెండు నెలలకే ఘాతుకం..!

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (13:32 IST)
ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అయితే భార్యను అనుమానంతో వేధింపులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా కసాయిలా చేతిని నరికాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో వెలుగుచూసింది. అనుమానం పెనుభూతమై పెళ్లైన రెండు నెలలకే భార్య చేతులు నరకడంతో బాధితురాలిని భోపాల్‌లోని హమిదియ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు తొమ్మిది గంటల పాటు ఆపరేషన్‌ నిర్వహించి ఆమె చేతులను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
 
భార్యపై అనుమానం పెంచుకున్న భర్త రణ్‌ధీర్‌ సోమవారం కట్టెలు తీసుకురావాలనే సాకుతో ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. మార్గమధ్యంలో రణ్‌ధీర్‌ గొడ్డలితో తన భార్య చేతులను నరికి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలిని నిందితుడు కేవలం రెండు నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నాడు. 
 
పెళైన పదిహేను రోజులకే భర్త తనను అనుమానంతో వేధించేవాడని, ఎవరితో మాట్లాడినా అభ్యంతరం తెలిపేవాడని బాధితురాలు పేర్కొన్నారు. మరోవైపు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో మహిళ కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందించలేదు. ప్రస్తుతం బాధితురాలికి ఆమె మామ సంరక్షకులుగా ఉన్నారు. కోడలిపై ఘాతుకానికి పాల్పడ్డ కుమారుడిని ఇక చేరదీయనని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments