మధ్యప్రదేశ్‌ బీటీఆర్‌లో 48 గంటల్లో 8 ఏనుగులు మృతి ఎలా?

సెల్వి
గురువారం, 31 అక్టోబరు 2024 (12:50 IST)
Elephant
మధ్యప్రదేశ్‌లోని ఉమారియా జిల్లా పరిధిలోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ (బిటిఆర్)లో గత 48 గంటల్లో ఎనిమిది అడవి ఏనుగులు అనుమానాస్పద విషప్రయోగం కారణంగా మరణించాయని అధికారులు తెలిపారు. మరో ఏనుగు తీవ్ర అస్వస్థతకు గురై పశువైద్యులచే చికిత్స పొందుతున్నట్లు సీనియర్ అటవీ అధికారి తెలిపారు. బీటీఆర్‌లో ఎనిమిది ఏనుగులు చనిపోయాయి (గత 48 గంటల్లో).. మరో ఏనుగు చికిత్స పొందుతోంది. మరణానికి గల కారణాలను పోస్టుమార్టం నివేదికల్లో తేలుస్తాం" అని అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (ఏపీసీసీఎఫ్) (వన్యప్రాణి) ఎల్ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. 
 
ఇకపోతే.. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఈ సంఘటనపై విచారణ కోసం అటవీ అధికారుల బృందాన్ని బీటీఆర్‌కు పంపింది. అంతేకాకుండా, ఈ సంఘటనపై విడిగా దర్యాప్తు ప్రారంభించడానికి రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) బుధవారం సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు వర్గాలు తెలిపాయి. 
 
ఎనిమిది మంది వెటర్నరీ డాక్టర్ల బృందం చనిపోయిన ఏనుగులకు పోస్టుమార్టం నిర్వహిస్తోంది. మృతదేహాన్ని ఖననం చేసేందుకు 300 బస్తాల ఉప్పును ఆర్డర్ చేశాం. ఇందుకోసం గుంతలు తవ్వేందుకు రెండు జేసీబీ యంత్రాలను వినియోగించనున్నట్టు బీటీఆర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ పీకే వర్మ బుధవారం విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments