Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు తీపి.. తన బిడ్డే క్లాస్ ఫస్ట్ రావాలనీ.. ఓ తల్లి దారుణం...

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (14:51 IST)
కడుపు తీపి ఆ తల్లిని చేయకూడని పని చేయించింది. స్కూల్‌లో తన బిడ్డే ఫస్ట్ రావాలంటూ మరో బిడ్డకు విషమిచ్చి చంపే ప్రయత్నం చేసింది. ఈ దారుణం పుదుచ్చేరి రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పుదుచ్చేరిలోని కారైక్కాల్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో రాజేంద్రన్ - మాలతి అనే దంపతుల కుమారుడు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఈ విద్యార్థి శుక్రవారం హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అతను విషం సేవించినట్టు వైద్యులు గుర్తించారు. 
 
వాచ్‌మెన్ ఇచ్చిన శీతలపానీయం తాగడం వల్లే అస్వస్థతకు లోనైనట్టు ఆ బాలుడు చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఈ విచారణలో ఓ మహిళ తనకు కూల్‌డ్రింక్స్ ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని చెప్పిందన్నారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ కూల్‌డ్రింక్స్ ఇచ్చిన మహిళను సహాయరాణి విక్టోరియాగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. 
 
ఆమె వద్ద జరిపిన విచారణలో మొదటి తరగతి నుంచి తన కుమారుడిని వెనక్కి నెట్టి రాజేంద్ర మాలతిల దంపతుల కుమారుడే ఫస్ట్ వస్తున్నాడనీ, దాన్ని జీర్ణించుకోలేక తాను విషమిచ్చానని అంగీకరించింది. దీంతో ఆమెపై హత్యాయత్నంతో పాటు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments