Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేకు 37 ఏళ్లు, నా కూతురికి 19 ఏళ్లు, భయపెట్టి పెళ్లాడాడు: తమిళనాడు తండ్రి సూసైడ్ యత్నం- Video

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2020 (16:47 IST)
ఇటీవలే తమిళనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభు, సౌందర్య అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా. అంతా బాగానే వుందని అనుకుంటున్నారు కానీ తన కుమార్తె సౌందర్యను ఎమ్మెల్యే ప్రభు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నారంటూ ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. 
 
అతడికి 37 ఏళ్లనీ, తన కుమార్తె 19 ఏళ్లనీ, అతడి వయసులో సగం వయసున్న తన కుమార్తెను కిడ్నాప్ చేసి పెళ్లాడారంటూ ఆయన పోలీసు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటే వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసారు. పోలీసులు అతడిని వారించారు.
 
కాగా సౌందర్య తండ్రి స్వామినాథన్ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. తన కుమార్తెను ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించినా తను లొంగలేదనీ, దాంతో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ ఆరోపిస్తున్నారు. ఐతే ఎమ్మెల్యే తరపు బంధువులు మాత్రం మేము దళితలమని ఆయన అలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
 
కానీ సౌందర్య తండ్రి ఈ విషయాన్ని కొట్టిపారేసారు. తను కులమతాలను పట్టించుకోననీ, కేవలం అతడికీ తన కుమార్తెకి వయసు అంతరమే తనకు అభ్యంతరమంటూ చెప్పుకొచ్చారు. తమకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టరుకి ఫిర్యాదు చేసారు. కోర్టులో పిటీషన్ కూడా వేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments