Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిగ్గూశరం ఉంటే చంద్రబాబును చూసి నేర్చుకోండి : స్టాలిన్ ధ్వజం

ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచి

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (16:11 IST)
ఏమాత్రం సిగ్గూశరం రోషముంటే ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబును చూసి నేర్చుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు ఏ విధంగా నిలదీస్తున్నారో ఓసారి చూసి తెలుసుకోవాలన్నారు. 
 
తమిళనాడులోని ఈరోడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు కేంద్రం ముందు సాష్టాంగపడి, రాష్ట్ర ప్రయోజనాలకు తిలోదకాలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. బలహీనమైన అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బీజేపీ చెప్పుచేతల్లో పెట్టుకుందని... తద్వారా తమిళనాడుపై పెత్తనం చెలాయిస్తోందని మండిపడ్డారు.
 
కేంద్ర ప్రభుత్వం ఎదుట సాష్టాంగపడిన, చేవ, తెగువ, వెన్నెముక లేనటువంటి పాలన తమిళనాడులో కొనసాగుతోందని స్టాలిన్ విమర్శించారు. కావేరీ బోర్డును ఏర్పాటు చేసే విషయంలో తమిళనాడును కేంద్రం వంచిస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసైనా సిగ్గు తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబుకు ఉన్న తెగువ, స్వాభిమానం, పౌరుషం, పోరాటపటిమ పళని, పన్నీర్ సెల్వంలకు ఎందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments