Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ మెహబూబా ముఫ్తీ గృహనిర్బంధం

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (07:53 IST)
జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని అధికారులు మరోసారి గృహనిర్బంధం విధించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

బుద్గామ్‌లో అధికారులు ఖాళీ చేయించిన బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్తున్న తనను గృహంలో నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తెలుపుతున్న ప్రతిపక్షాలపై చట్టవ్యతిరేకంగా నిర్బంధం విధించి.. వారిని గందరగోళానికి గురిచేయడం మోడీ సర్కార్‌ తన విధిగా మార్చుకుందని విమర్శించారు.

'నేను మరోసారి నిర్భంధించబడ్డాను.. కారణం బుద్గామ్‌లో తమ ఇళ్ల నుండి బలవంతంగా ఖాళీ చేయబడ్డ వందలాది మంది బాధితుల్ని పరామర్శించాలనుకోవడమే' అని ట్వీట్‌ చేశారు. శ్రీనగర్‌లో తన ఇంటి గేట్లకు తాళం వేసి ఉన్న దృశ్యాలను కూడా ఆమె పోస్ట్‌ చేశారు. జమ్ముకాశ్మీర్‌ ప్రజలపై అణిచివేత కొనసాగుతోందని ఆమె మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments