హనీమూన్ మర్డర్ కేసులో ఎవరీ సంజయ్ వర్మ?

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (14:53 IST)
మేఘాలయ హనీమూన్‌కు వెళ్లిన జంటలో వరుడు హత్య కేసులో తెరపైకి వచ్చిన సంజయ్ వర్మ ఎవరు మిస్టరీని పోలీసులు తేల్చారు. సోనమ్ రఘువంశీ కాల్ డేటాలో సంజయ్ వర్మ అనే వ్యక్తితో అత్యధికంగా మాట్లాడినట్లు తేలగా, ఆ వ్యక్తి ఎవరనేది మిస్టరీగా మారింది. తాజాగా పోలీసులు ఈ మిస్టరీని ఛేదించారు. సంజయ్ వర్మ మరెవరో కాదు సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహానేనని నిర్ధారించారు. 
 
ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఉండేందుకే రాజ్ కుశ్వాహా మొబైల్ నంబర్‌ను సంజయ్ వర్మ పేరుతో సోనమ్ సేవ్ చేసుకుందని పోలీసులు తెలిపారు. రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత కూడా సోనమ్, సంజయ్ అలియాస్ రాజ్ కుశ్వాహాలు ఫోనులో మాట్లాడుకున్నారని, 39 రోజుల వ్యవధిలో 324 సార్లు ఫోన్ చేసుకున్నట్టు తేలింది. ప్రస్తుతం సంజయ్ వర్మ మొబైల్ స్విచ్ఛాఫ్ ఉంది. ఈ హత్యకు రాజ్ కుశ్వాహానే పథకం రచించాడన పోలీసుల స్పష్టం చేశారు. 
 
కాగా, సంజయ్ వర్మ గురించి తనకు తెలియదని సోనమ్ సోదరుడు గోవింద్ తెలిపారు. ఈ కేసులో సంజయ్ పేరు కూడా వస్తోందని ఇవాళే తెలిసింది అని అన్నారు. రాజా హత్యకు సోనమ్ ముగ్గురు కిరాయి హంతకులను నియమించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కాలికి దెబ్బ తగిలితే నిర్మాత చిట్టూరి సెంటిమెంట్ అన్నారు : అల్లరి నరేష్

Nayanthara: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో నయనతార లుక్

అర్జున్, ఐశ్వర్య రాజేష్ ల ఇన్వెస్టిగేటివ్ డ్రామాగా మఫ్టీ పోలీస్ సిద్ధం

రాజు వెడ్స్ రాంబాయి కి కల్ట్ మూవీ అనే ప్రశంసలు దక్కుతాయి - తేజస్వినీ, అఖిల్ రాజ్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments