Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమ్మోళ్లపై ద్వేషంతోనే అమరరాజాను తరిమేశారు : కన్నా

ఠాగూర్
గురువారం, 19 జూన్ 2025 (14:25 IST)
కమ్మోళ్లపై ఉన్న ద్వేషంతోనే అమరరాజా ఫ్యాక్టరీని రాష్ట్రం నుంచి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తరిమేశారని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అలాగే, జగన్ ఓదార్పు యాత్రలకు వెళ్ళినట్టుగా లేదని, ఒక యుద్ధానికి వెళ్లినట్టుగా ఉందన్నారు. 
 
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా జరిగిన పరిణామాలపై కన్నా గురువారం విలేకరులతో మాట్లాడుతూ, జగన్ పర్యటన ఓదార్పు యాత్రలాకాకుండా పల్నాడుపై యుద్ధానికి వెళ్లినట్టుగా ఉందన్నారు. నాగమల్లేశ్వర రావు మృతికి 100కు వంద శాతం జగన్మోహన్ రెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. పోలీస్ వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడం అవాస్తమని అన్నారు.
 
పల్నాడులో అరాచక ర్యాలీ నిర్వహించారు. ఈ పైశాచిక ప్రవర్తనతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారన్నారు. జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. జగన్ రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను బయటకురాకుండా అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయన్నారు. జగన్ బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. కమ్మవారిపైనే ద్వేషంతోనే అమరరాజా బ్యాటరీ పరిశ్రమను రాష్ట్రం నుంచి తరిమేశారని, అమరావతిని నాశనం చేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments