Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నెలలుగా జీతాలు లేక ఇడ్లీలు విక్రయిస్తున్న ఇస్రో ఉద్యోగి

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (14:00 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఇటీవల ప్రపంచ దేశాలను సైతం ఆశ్చర్యపరిచేలా చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. అయితే, ఇస్రోలో పని చేసే ఉద్యోగుల్లో కొందరికి గత 18 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో చంద్రయాన్-3‌కి లాంచ్‌పాడ్ తయారు చేసిన సభ్యుల్లో ఒకరైన దీపక్ కుమార్ కుటుంబ పోషణ నిమిత్తం ప్రస్తుతం ఇడ్లీలు విక్రయిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దీపక్ కుమార్.. గత 2012లో భారత ప్రభుత్వం రంగ సంస్థ హెచ్.ఎస్.ఈ.సీ‍లో టెక్నీషియన్‌గా చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన కుటుంబ పోషణ కోసం రాంచీలోని రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకుని ఇడ్లీలు విక్రయిస్తున్నాడు. 
 
ఉదయం ఇడ్లీలు అమ్మి ఆఫీసుకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చి అదే పనిచేస్తున్నారు. దానికి కారణం 18 నెలలుగా హెచ్ఎస్ఈసీలో ఉద్యోగులకు జీతాలు అందకపోవడమే. మంగళవారం మీడియాతో దీపక్ కుమార్ మాట్లాడుతూ తన దీనస్థితిని వివరించారు. 'తొలుత క్రెడిట్ కార్డు తీసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. రూ.2 లక్షల అప్పు తీర్చకపోవడంతో తనను డీఫాల్టర్ ప్రకటించారు. 
 
అనంతరం తన భార్య నగలు తాకట్టు పెట్టాను. ఆకలితో చావకూడదని నిశ్చయించుకుని ఇడ్లి బండి పెట్టాను. రోజుకు రూ.300-400 వస్తున్నాయి. పెట్టుబడిపోగా రూ.50-100 మిగులుతున్నాయి. ఈ డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాను అని భావోద్వేగంతో చెప్పారు. స్కూలు ఫీజును చెల్లించకపోవడంతో యాజమాన్యం తన ఇద్దరు కూతుళ్లను అవమానించిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments