Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన మాయావతి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:27 IST)
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో సీఏఏకు మద్దతు ప్రకటించిన సొంత పార్టీ ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్‌పై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని మాయావతి ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు.

'బీఎస్‌పీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ క్రమశిక్షణను ఉల్లంఘించే ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ఫథెరియా ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ సీఏఏకు మద్దతు ప్రకటించారు. దాంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా బ్యాన్ విధించాం' అని మాయావతి ఆ ట్వీట్‌లో తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం విభజనలను సృష్టిస్తుందని, రాజ్యాంగ నియమనిబంధనలకు వ్యతిరేకమని బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉందని, పార్లమెంటులో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని మరో ట్వీట్‌లో మాయావతి తెలిపారు.

సీఏఏను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరిన వారిలో బీఎస్‌పీ కూడా ఉందన్నారు. ఇంత జరిగినా సీఏఏకు రమాభాయ్ పరిహార్ మద్దతు ప్రకటించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments