Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన మాయావతి.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (07:27 IST)
పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో సీఏఏకు మద్దతు ప్రకటించిన సొంత పార్టీ ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్‌పై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయాన్ని మాయావతి ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు.

'బీఎస్‌పీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఆ క్రమశిక్షణను ఉల్లంఘించే ఎంపీలు, ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకుంటాం. ఫథెరియా ఎమ్మెల్యే రమాభాయ్ పరిహార్ సీఏఏకు మద్దతు ప్రకటించారు. దాంతో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా బ్యాన్ విధించాం' అని మాయావతి ఆ ట్వీట్‌లో తెలిపారు.

పౌరసత్వ సవరణ చట్టం విభజనలను సృష్టిస్తుందని, రాజ్యాంగ నియమనిబంధనలకు వ్యతిరేకమని బీజేపీ మొదటి నుంచి చెబుతూనే ఉందని, పార్లమెంటులో కూడా సీఏఏకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని మరో ట్వీట్‌లో మాయావతి తెలిపారు.

సీఏఏను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరిన వారిలో బీఎస్‌పీ కూడా ఉందన్నారు. ఇంత జరిగినా సీఏఏకు రమాభాయ్ పరిహార్ మద్దతు ప్రకటించడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments