Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి సామూహిక వివాహాలు .. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:07 IST)
ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ వివాహాల పేరుతో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా బొక్కేస్తున్నారు. ఈ తంతు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలో పేద యువతుల పెళ్లిళ్ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థిక సాయం కింద రూ.51,000 ఇస్తుంది. అక్రమంగా లబ్ది పొందాలనే దురాశతో కొందరు అధికారులు దళాతులతో కుమ్మక్కయ్యారు. ఆ మేరకు జనవరి 25వ తేదీన మునియర్ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకొచ్చారు. 
 
పెళ్లికాని, పళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఎర చూపారు. ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ దృశ్యాలు టీవీల్లో వైరల్ కావడంతో అసలు విషయం బహిర్గతమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఎనిమిది మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. అయితే, ఈ సామూహిక పెళ్ళిళ్ళు చేసుకున్న దంపతులకు ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments