Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి సామూహిక వివాహాలు .. ఎక్కడ?

ఠాగూర్
గురువారం, 1 ఫిబ్రవరి 2024 (11:07 IST)
ప్రభుత్వం అందించే డబ్బుల కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ వివాహాల పేరుతో ప్రభుత్వ సొమ్మును అప్పనంగా బొక్కేస్తున్నారు. ఈ తంతు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ రాష్ట్రంలో పేద యువతుల పెళ్లిళ్ల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థిక సాయం కింద రూ.51,000 ఇస్తుంది. అక్రమంగా లబ్ది పొందాలనే దురాశతో కొందరు అధికారులు దళాతులతో కుమ్మక్కయ్యారు. ఆ మేరకు జనవరి 25వ తేదీన మునియర్ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకొచ్చారు. 
 
పెళ్లికాని, పళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఎర చూపారు. ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఈ దృశ్యాలు టీవీల్లో వైరల్ కావడంతో అసలు విషయం బహిర్గతమైంది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఎనిమిది మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. అయితే, ఈ సామూహిక పెళ్ళిళ్ళు చేసుకున్న దంపతులకు ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments