Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భారీ వర్షాలు - కొండ చరియలు విరిగిపడి...

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (08:31 IST)
మణిపూర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య శుక్రవారం ఉదయానికి 14కు చేరింది. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 23 మందిని సురక్షితంగా రక్షించారు. 
 
మరోవైపు, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైలు నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో తొలుత ఏడుగురు జవాన్లతో సహా ఎనిమిది మంది చనిపోయారు. 70 మంది వరకు గల్లంతయ్యారు. అయితే, శుక్రవారాం ఉదయానికి ఈ మృతుల సంఖ్య 14కు చేరింది. 
 
ఈ ప్రమాదంలో మణిపూర్ డీజీపీ డౌంగెల్ స్పందిస్తూ, శిథిలాల కింద ఎంత మంది చిక్కుకునివున్నారనే విషయంపై స్పష్టత లేదన్నారు. అయితే, దాదాపు 60 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చన్న అంచనాలు వేస్తున్నట్టు చెప్పారు. వారిలో ఆర్మీ, రైల్వే అధికారులు, కూలీలు, గ్రామస్థులు ఉన్నారని ఆయన తెలిపారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లేనని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments