Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూలిపోయిన హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం

కూలిపోయిన హెలికాఫ్టర్ బ్లాక్ బాక్స్ లభ్యం
, గురువారం, 9 డిశెంబరు 2021 (11:34 IST)
నీలగిరి జిల్లాలో కూలిపోయిన భారత రక్షణ శాఖకు చెందిన అత్యాధునిక హెలికాఫ్టర్‌ బ్లాక్ బాక్స్‌ను భారత ఎయిర్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని విశ్లేషించేందుకు ఢిల్లీకి తీసుకెళ్లారు. 
 
కాగా, నీలగిరి జిల్లా కాట్టేరి ప్రాంతంలో ఈ హెలికాఫ్టర్ కూలిపోగా, ఇందులో ప్రయాణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్‌తో సహా ఆయన భార్య మధులిక రావత్, మరో 11 మంది రక్షణ శాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం నుంచి హెలికాఫ్టర్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా విషాదం నింపిన హెలికాఫ్టర్ ప్రమాదానికి గల కారణాలను పలువురు విధాలుగా చెబుతున్నారు. అయితే, స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు, రక్షణ రంగ నిపుణులు మాత్రం మరోలా అభిప్రాయపడుతున్నారు. హెలికాఫ్టర్ ప్రమాదం జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం. పైగా, దట్టంగా పొగమంచు అలుముకునివున్నది. ఈ పొగ మంచే హెలికాఫ్టర్ ప్రమాదానికి కారణమై ఉండొచ్చన్నది పలువురు అభిప్రాపడుతున్నారు. 
 
ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఊటీ ఉన్న జిల్లా నీలగిరి. ఈ ప్రాంతంలో సాధారణంగానే మంచుదుప్పటి ఉంటుంది. పైగా, మంచుకాలంలో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇటీవల నీలగిరి జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు తగ్గిపోవడంతో ఇపుడు పొగమంచు కూడా ఎక్కువైంది. ఈ కారణంగానే ఈ హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని స్థానికులు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మరికొద్దిసేపట్లో వెల్లింగ్టన్‌కు చేరుకోవాల్సివున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్, ఆయన అర్థాంగి మధులిక రావత్, మరో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లభించిన ఎం-17 హెలికాప్టర్ డేటా: బ్లాక్ బాక్స్‌ ద్వారా..?