Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగుళూరు-ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే...

Webdunia
శనివారం, 24 జులై 2021 (16:28 IST)
మంగుళూరు-ముంబై ట్రైన్ యాక్సిడెంట్ దృశ్యాలు చూస్తే...ఎవరికైనా గుండెల్లో రైళ్ళు ప‌రుగెడ‌తాయి. ఇంత జ‌రిగినా ఒక్క‌రి ప్రాణం కూడా పోక‌పోవ‌డం చాలా అదృష్ట‌మ‌నే చెప్పాలి. అంత‌లా ఉన్నాయి ఈ యాక్సిడెంట్ దృశ్యాలు.
 
గోవా-కర్ణాటక బోర్డర్ లోని ప్రఖ్యాత దూద్​సాగర్ జలపాతం దగ్గర ఈ ఎక్స్​ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. భారీ వర్షాల కారణంగా రైలు పట్టాలపై కొండ చరియలు విరిగి పడడంతో మంగళూరు నుంచి ముంబయి వెళ్తున్న రైలు (01134) సోనాలిమ్- దూద్​సాగర్ స్టేషన్ల మధ్య ప్రమాదానికి గురైంది. రైలు ఇంజిన్, మొదటి జనరల్ బోగీ పట్టాలు తప్పింది.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగ లేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. పట్టాలు తప్పిన బోగీల్లోని ప్రయాణికులను వెంటనే వేరే బోగోల్లోకి తరలించారు. అదే సమయంలో దూద్​సాగర్-కరన్ జోల్ రైల్వే స్టేషన్ల మధ్య కూడా పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మంగళూరు-ముంబై రైలుని రూట్  మార్చి  తిరిగి కులెమ్ రైల్వే స్టేషన్ కి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments