Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో కోలుకుంటున్న చిరుత వీరుడు... గ్రామస్థుల ప్రశంసలు

Webdunia
గురువారం, 25 ఫిబ్రవరి 2021 (10:18 IST)
కర్నాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాల్లో చిరుత దాడిలో తలకు బలమైన గాయాలైన చిరుత వీరుడు రాజగోపాల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ చిరుత తన భార్యా కుమారుడిని చంపేందుకు ప్రయత్నించగా, రాజగోపాల్ తిరగబడి ఆ చిరుతను చంపేసిన విషయం తెల్సిందే. 
 
జిల్లాలోని అరసికెరె తాలూకా బెండిగెరె వద్ద కుటుంబ సభ్యులపై చిరుత దాడిచేస్తుండటాన్ని చూసి.. ప్రాణాలొడ్డి ప్రతిఘటించిన రాజగోపాల్‌ సాహసాన్ని అన్ని వర్గాల ప్రజలూ ప్రశంసించారు. ఈ ఘటనలో చిరుత చనిపోయింది. 
 
పోరాట వేళ చిరుత పంజా విసరడంతో తలకు, భుజంపై రాజగోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని గ్రామస్థులు తెలిపారు. 
 
చిరుతతో దాదాపు 20 నిమిషాలపాటు ఆయన వీరోచితంగా పోరాడారు. ఎన్నిసార్లు పంజాతో దాడిచేసినా రక్త గాయాల బాధను ఓర్చుకుంటూ ఏమాత్రం వెనుకంజ వేయకుండా దానిపై కట్టెతో దాడిచేసి.. చివరికి మెడను గట్టిగా అదిమిపట్టి.. ఊపిరాడకుండా చేసి నేలకొరిగేలా చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. చిరుతతో పోరాడిన రాజగోపాల్‌ బాగా అలిసిపోయారని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments