Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడని ఇంటికి పిలిస్తే భార్యతో ఎఫైర్.. అంతే తమ్ముడితో కలిసి?

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (09:50 IST)
అక్రమ సంబంధాల కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యతో స్నేహితుడి ఎఫైర్‌ సహించని ఓ భర్త సోదరుడితో కలిసి అతడిని హతమార్చిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని బందూప్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.  
 
బందూప్ ఏరియాలో అవినాష్ అశోక్ థొరానే (31) అనే వ్యక్తి తన భార్య, తమ్ముడు అశ్విన్ అశోక్ థొరానే (24)తో కలిసి నివాసం ఉంటున్నాడు. వీరికి సెవ్రీలోని ఓ కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ అవినాష్ (24) స్నేహితుడు. అవినాష్ ద్వారా ఘట్కోపర్‌లోని కన్‌స్ట్రక్సన్ కంపెనీలో పనిచేసే సివిల్ ఇంజినీర్ సూరజ్ పతాయిత్ (24) పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో ఇంటికి వెళ్తూ రావడం ప్రారంభించాడు. 
 
ఆ సందర్భంలో అవినాష్‌ భార్యతో సూరజ్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలుసుకున్న అవినాష్ థొరానే, తన తమ్ముడు అశ్విన్‌, స్నేహితుడు అవినాష్‌తో కలిసి సూరజ్‌ను హత్య చేశాడు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నదమ్ములైన అవినాష్ థొరానే, అశ్విన్ థొరానేలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు, సివిల్ ఇంజినీర్ అవినాష్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments