ఎయిర్‌టెల్ మొబైల్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్లలో 5జీ పని చేయడం లేదు!

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (20:42 IST)
దేశంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తరం రేడియో తరంగాల(5జీ) సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎంపిక చేసిన కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే ఈ సేవలను తీసుకొచ్చారు. అయితే, ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్ తగిలింది. ఈ 5జీ సేవలు ఐఫోన్, శాంసంగ్, వన్ ప్లస్‌తో పాటు ఇతర స్మార్ట్ ఫోన్లలో పని చేయడం లేదని యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. అయితే, మొబైల్ టెక్ నిపుణుల మాత్రం దీనిపై ఆందోళన చెందానక్కర్లేదని ఫోనులో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. 
 
5జీ సేవలు యాపిల్, శాంసంగ్‌ సిరీస్‌లో ఫ్లిప్ 4, ఫోల్డ్ 4, ఎస్ 21 ఎఫ్, గెలాక్సీ ఎస్ 22, ఎస్ 22 అల్ట్రా అండ్ ఎస్ 22, వన్ ప్లస్‌కు చెందిన వన్ ప్లస్ 8, 8 ప్రో, 9 ఆర్, నార్డ్ 2 9ఆర్టీలలో పని చేయడం లేదని మిగిలిన స్మార్ట్ ఫోన్లలో ఈ ఫాస్టెస్ టెక్నాలజీని వినియోగించుకునే సౌలభ్యం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. మరోవైపు, ఎయిర్‌టెల్‌తో పాటు మొబైల్ తయారీ కంపెనీలు 5జీ టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. కాగా 4జీ సేవల కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలను పొందవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది ప్రమోషన్ కు ముందు రామ్ చారణ్ కుడిచేతి బ్యాండేజ్ పై అభిమానులు ఆసక్తి

Naga Chaitanya: రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న వృషకర్మ

Pavala Shyamala: ఫుట్‌పాత్‌పై దీనస్థితిలో పావలా శ్యామల..

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

తర్వాతి కథనం
Show comments