Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (13:58 IST)
బెంగుళూరులో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తే ఓ వ్యక్తితో సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిణిగా పనిచేసే ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటాని టెక్కీని నమ్మించి తన కామవాంఛ తీర్చుకుంది. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ టెక్కీని మోసం చేసింది. ఈ మోసాన్ని భరించలేని ఆ టెక్కీ ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపూర్‌‍కు చెందిన అభిషేక్ (40) అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిగా పనిచేసే ఓ మహిళ పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో టెక్కీని పెళ్లి చేసుకుంటానని ఆ మహిళ నమ్మించి, తన లైంగిక కోర్కెలను తీర్చుకుంది. 
 
ఆ తర్వాత ఆమె టెక్కీతో సంబంధాలు తెంచుకుంది. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయగా, ఆమెకు ఇదివరకే వివాహమై ఉన్నట్టు గ్రహించాడు. దీన్ని జీర్ణించుకోలేని టెక్కీ, మంగుళూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ మహిళాధికారి ప్రస్తుతం కర్నాటకలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం