Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి పేరుతో టెక్కీతో సీఐఎస్ఎఫ్ అధికారిణి పడకసుఖం ... సీన్ కట్ చేస్తే...

ఠాగూర్
మంగళవారం, 4 మార్చి 2025 (13:58 IST)
బెంగుళూరులో ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తే ఓ వ్యక్తితో సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిణిగా పనిచేసే ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. పెళ్లి చేసుకుంటాని టెక్కీని నమ్మించి తన కామవాంఛ తీర్చుకుంది. తీరా సీన్ కట్ చేస్తే.. ఆ టెక్కీని మోసం చేసింది. ఈ మోసాన్ని భరించలేని ఆ టెక్కీ ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజిపూర్‌‍కు చెందిన అభిషేక్ (40) అనే వ్యక్తి బెంగుళూరులోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు సీఐఎస్ఎఫ్‌లో ఉన్నతాధికారిగా పనిచేసే ఓ మహిళ పరిచయమైంది. అప్పటి నుంచి వారిద్దరూ తరచుగా మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో టెక్కీని పెళ్లి చేసుకుంటానని ఆ మహిళ నమ్మించి, తన లైంగిక కోర్కెలను తీర్చుకుంది. 
 
ఆ తర్వాత ఆమె టెక్కీతో సంబంధాలు తెంచుకుంది. ఆ తర్వాత ఆమె గురించి ఆరా తీయగా, ఆమెకు ఇదివరకే వివాహమై ఉన్నట్టు గ్రహించాడు. దీన్ని జీర్ణించుకోలేని టెక్కీ, మంగుళూరులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ మహిళాధికారి ప్రస్తుతం కర్నాటకలో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

ఛావా తెలుగు ట్రైలర్ ట్రెండింగ్ లోకి వచ్చింది

అనంతిక సనీల్‌కుమార్‌ 8 వసంతాలు లవ్ మెలోడీ సాంగ్ రిలీజ్

దసరా సినిమాలో నాని కాకుండా మరొక పాత్రకు నన్ను అడిగారు : జీవీ ప్రకాష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం