Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (12:02 IST)
భార్య మార్పిడికి భార్యను బలవంతం చేశాడనే ఆరోపణలపై వ్యక్తిపై కేసు నమోదైంది. 2008 నుండి నిందితుడితో ఆమెకు వివాహం జరిగింది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె వుంది. అయితే భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
తన జీవిత భాగస్వామిని కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అసభ్యకరమైన ఫోటోలను క్లిక్ చేయడంతో పాటు భార్య మార్పిడికి బలవంతం చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
 
లక్నోలోని ఆషియానా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. సదరు మహిళకు 2008లో నిందితుడితో వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లయినప్పటి నుంచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఆడపిల్ల పుట్టాక అది పెరిగిపోయిందని ఆరోపించింది.
 
తాను నిద్రిస్తున్న సమయంలో తన భర్త తన ఫోటోలను క్లిక్‌ చేసి తన స్నేహితులతో పంచుకున్నాడని ఆమె ఆరోపించింది. రోజురోజుకూ తన భర్త ప్రవర్తన దారుణంగా మారిందని ఆ మహిళ చెప్పింది. భర్త తనను వేధింపులకు గురిచేసి భార్య మార్పిడికి బలవంతం చేశాడని.. ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చాడని చెప్పింది.
 
 ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతోందని ఆషియానా ఎస్‌హెచ్‌ఓ ఛత్రపాల్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments