Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (12:02 IST)
భార్య మార్పిడికి భార్యను బలవంతం చేశాడనే ఆరోపణలపై వ్యక్తిపై కేసు నమోదైంది. 2008 నుండి నిందితుడితో ఆమెకు వివాహం జరిగింది. ఈ ఇద్దరికి ఒక కుమార్తె వుంది. అయితే భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించిన ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
తన జీవిత భాగస్వామిని కొట్టి, చిత్రహింసలకు గురిచేసి, అసభ్యకరమైన ఫోటోలను క్లిక్ చేయడంతో పాటు భార్య మార్పిడికి బలవంతం చేసినందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.
 
లక్నోలోని ఆషియానా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల భార్య తన భర్తపై ఫిర్యాదు చేసింది. సదరు మహిళకు 2008లో నిందితుడితో వివాహమై ఒక కుమార్తె కూడా ఉంది. పెళ్లయినప్పటి నుంచి తనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఆడపిల్ల పుట్టాక అది పెరిగిపోయిందని ఆరోపించింది.
 
తాను నిద్రిస్తున్న సమయంలో తన భర్త తన ఫోటోలను క్లిక్‌ చేసి తన స్నేహితులతో పంచుకున్నాడని ఆమె ఆరోపించింది. రోజురోజుకూ తన భర్త ప్రవర్తన దారుణంగా మారిందని ఆ మహిళ చెప్పింది. భర్త తనను వేధింపులకు గురిచేసి భార్య మార్పిడికి బలవంతం చేశాడని.. ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాలని తనపై ఒత్తిడి తెచ్చాడని చెప్పింది.
 
 ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతోందని ఆషియానా ఎస్‌హెచ్‌ఓ ఛత్రపాల్ సింగ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments