Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ చార్జీలు భారీగా పెంచాల్సిందే : ఎయిర్ టెల్ సీఈవో

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (12:01 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికా కంపెనీల్లో ఒకటైన ఎయిర్‌ టెల్ ఎండీ గోపాల్ విట్టల్ మొబైల్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త వినిపించారు. మొబైల్ చార్జీలను భారీగా పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. సమీప భవిష్యత్‌లో మొబైల్ చార్జీలను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 
 
ప్రస్తుతం ప్రతి వినియోగదారుడిపై కంపెనీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) సుమారు రూ.200గా ఉందని, నిజానికి ఇది దాదాపు రూ.300 ఉండాలని ఆయన పేర్కొన్నారు. రూ.300లకు పెంచినప్పటికీ ప్రపంచంలోనే ఇదే అత్యల్ప ఏఆర్పీయూగా ఉంటుందని విట్టల్ అభిప్రాయపడ్డారు.
 
ఆర్థిక సంవత్సరం-2024 నాలుగో త్రైమాసికానికి ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.209కు చేరిందని, 2023 నాలుగో త్రైమాసికంలో ఇది రూ.193గా ఉందంటూ ఆయన పోల్చారు. టెలికాం రంగంలో టారిఫ్ రేట్లలో ప్రధాన సవరణ చేయాల్సిన అవసరం ఉందని విట్టల్ పేర్కొన్నారు. గత రెండు త్రైమాసికాల్లో ఏఆరీయూలో పెరుగుదల ఉందని, అయితే మరిన్ని పెంపులు అవసరమని అన్నారు. ఎయిర్టెల్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments