Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.5లు తక్కువైందని.. హోటల్ యజమాని అంత పనిచేశాడా?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:41 IST)
చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో హత్యలు జరిగిపోతున్నాయి. తాజాగా ఐదు రూపాయల కోసం ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హోటల్‌లో భోజనం చేసిన వ్యక్తి రూ.5లు తక్కువ ఇవ్వడంతో సదరు హోటల్‌ యజమాని అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం కేంఝర్‌ జిల్లా ఘాసిపూర్‌ పట్టణంలోని లక్ష్మీ బజార్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో జితేంద్ర దేహురి భోజనం చేశాడు. అనంతరం హోటల్‌ యజమాని మధుసూదన్‌ సాహు రూ.45 బిల్లు అయిందని జితేంద్రకు చెప్పాడు. దాంతో జితేంద్ర తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఐదు రూపాయలు సాయంత్రం ఇస్తానని తెలిపాడు. దాంతో హోటల్‌ యజమాని తన కొడుకుతో కలిసి జితేంద్రపై దాడి చేశాడు.
 
అనంతరం జితేంద్ర స్థానిక పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హోటల్‌ యజమానిని, అతని కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాడి ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments