రూ.5లు తక్కువైందని.. హోటల్ యజమాని అంత పనిచేశాడా?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:41 IST)
చిన్న చిన్న కారణాలకే గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో హత్యలు జరిగిపోతున్నాయి. తాజాగా ఐదు రూపాయల కోసం ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. హోటల్‌లో భోజనం చేసిన వ్యక్తి రూ.5లు తక్కువ ఇవ్వడంతో సదరు హోటల్‌ యజమాని అతడిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. శనివారం కేంఝర్‌ జిల్లా ఘాసిపూర్‌ పట్టణంలోని లక్ష్మీ బజార్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో జితేంద్ర దేహురి భోజనం చేశాడు. అనంతరం హోటల్‌ యజమాని మధుసూదన్‌ సాహు రూ.45 బిల్లు అయిందని జితేంద్రకు చెప్పాడు. దాంతో జితేంద్ర తన వద్ద రూ.40 మాత్రమే ఉన్నాయని, మిగిలిన ఐదు రూపాయలు సాయంత్రం ఇస్తానని తెలిపాడు. దాంతో హోటల్‌ యజమాని తన కొడుకుతో కలిసి జితేంద్రపై దాడి చేశాడు.
 
అనంతరం జితేంద్ర స్థానిక పోలీస్‌ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు హోటల్‌ యజమానిని, అతని కుమారుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దాడి ఘటనను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

Shah Rukh Khan: లండన్ లీసెస్ట‌ర్ స్క్వేర్‌లో షారూఖ్ ఖాన్‌, కాజోల్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments