Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా కేసులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:39 IST)
దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20 వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఇది నిన్నటికంటే 4.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది. ఇందులో 3,24,47,032 మంది కరోనా నుంచి బయటపడగా, 3,74,269 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మరో 4,42,874 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 219 మంది మృతిచెందగా, 37,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మరోవైపు, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 20,240 కేసులు ఉన్నాయని, కొత్తగా 67 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతున్నదని తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD చిత్రం సామాన్య ప్రేక్షకులను అలరిస్తుందా? రివ్యూ రిపోర్ట్

ప్రభాస్ "కల్కి" అవతారం విరామం వరకు ఎలా ఉందంటే...

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments