దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా కేసులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:39 IST)
దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20 వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఇది నిన్నటికంటే 4.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది. ఇందులో 3,24,47,032 మంది కరోనా నుంచి బయటపడగా, 3,74,269 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మరో 4,42,874 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 219 మంది మృతిచెందగా, 37,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మరోవైపు, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 20,240 కేసులు ఉన్నాయని, కొత్తగా 67 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతున్నదని తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యాలకు, వారణాసి టైటిల్ పై రాజమౌళి కు చెక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments