Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా కేసులు

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:39 IST)
దేశంలో మరోమారు 30 వేల దిగువకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం 28 వేల మంది కరోనా బారిన పడగా, తాజాగా మరో 27 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 20 వేలకు పైగా కేసులు ఉన్నాయి. ఇది నిన్నటికంటే 4.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గత 24 గంటల్లో కొత్తగా 27,254 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,32,64,175కు చేరింది. ఇందులో 3,24,47,032 మంది కరోనా నుంచి బయటపడగా, 3,74,269 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
మరో 4,42,874 మంది బాధితులు మరణించారు. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 219 మంది మృతిచెందగా, 37,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
 
మరోవైపు, కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 20,240 కేసులు ఉన్నాయని, కొత్తగా 67 మంది మృతిచెందారని వెల్లడించింది. ఇక కరోనా వ్యాక్సినేషన్‌ జోరుగా సాగుతున్నదని తెలిపింది. గత 24 గంటల్లో 53,38,945 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొన్నది. దీంతో ఇప్పటివరకు 74,38,37,643 కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేశామని వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments