Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?

Webdunia
బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:37 IST)
కేరళలో తండ్రి అనుమతితో.. అతడి స్నేహితులు 30 మంది 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మలప్పురం, సెల్లేరి ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక.. వరుసగా స్కూలుకు సెలవులు పెట్టేది.
 
దీన్ని గమనించిన బాలిక క్లాస్ టీచర్.. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆపై ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు పాఠశాల యాజమాన్యంతో పాటు శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఆ సందర్భంగా ఆ బాలిక వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలిక చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. 
 
గత రెండేళ్ల పాటు ఆ విద్యార్థినిపై తండ్రితో పాటు అతడి స్నేహితులు చాలామంది లైంగికంగా దాడి చేశారని తెలియవచ్చింది. పాఠశాల సెలవుల సందర్భంగా ఆ బాలిక ఇంటికి వచ్చే పురుషుల సంఖ్య అధికమని తెలిసింది. 
 
దాదాపు 30 ఏళ్ల దాటిన వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్కో చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేశారు. బాధితురాలిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం