Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమత బెనర్జీ మంత్రివర్గంలో.. మనోజ్ తివారీకి చోటు..!

Webdunia
సోమవారం, 10 మే 2021 (22:19 IST)
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది. ఇందులో తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 43 మంది శాసనసభ్యులు సోమవారం రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. 
 
బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వీరితో ప్రమాణం చేయించారు. వీరిలో 24 మంది కేబినెట్‌ మంత్రులు కాగా, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. మంత్రి మండలిలో సీనియర్‌ నేతలు, అనుభవజ్ఞులు, కొత్తవారికి చోటు దక్కింది.
 
సీఎం మమతా బెనర్జీతో కలిపి మంత్రివర్గంలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. బెంగాల్‌ రంజీ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత మనోజ్‌ తివారీ సైతం మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నాడు.
 
తివారీకి క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు తెలిసింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనోజ్‌..టీఎంసీ చీఫ్‌ మమతా ఆధ్వర్యంలో పార్టీలో చేరాడు. భారత్‌ తరఫున తివారీ 12 వన్డేలు, 3 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments