Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవాలతో రాజకీయమా.. మీకు సిగ్గుగా లేదు : మమతా బెనర్జీ నిప్పులు

Webdunia
గురువారం, 7 మార్చి 2019 (09:00 IST)
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల శవాలతో భారతీయ జనతా పార్టీ నేతలు రాజకీయాలు చేయడంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. వీర జవాన్ల మృతదేహాలతో రాజకీయం చేయడం మీకు సిగ్గుగా లేదా అంటూ ప్రధాని నరేంద్ర మోడీని ఆమె సూటిగా ప్రశ్నించారు. 
 
పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, జవాన్ల వీర మరణంతో ప్రధాని మోడీ రాజకీయాలు చేస్తున్నారని, తానొక్కడినే దేశభక్తుడినని, మిగతావారు దేశద్రోహులని చిత్రీకరించే విధంగా మాట్లాడుతున్నారన్నారు. 
 
జవాన్ల మృతదేహాలతో రాజకీయాలు చేయడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని, మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాజకీయ ఉనికికి ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రజలకు సూచించారు. 
 
గత ఐదేళ్ళ కాలంలో మీరు (మోడీ) చేసింది ఏమీ లేదు. పైగా మన జవాన్ల వీరమరణాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. మేం మోడీ ప్రభుత్వం వెనుక లేము. దేశానికి రక్షణ కల్పిస్తున్న మన సైనికుల వెంట ఉన్నాం అని అన్నారు. బాలాకోట్ ఉగ్రదాడుల వివరాలు బయటపెట్టమని తాము ప్రభుత్వాన్ని నిలదీస్తే మాపై పాకిస్థాన్ ముద్ర వేస్తున్నారని, ఆయన (మోడీ) తాను మాత్రమే భారతీయుడినని అనుకుంటున్నారని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జార్జియాలో "అఖండ-2" మూవీ షూటింగ్

Sugar Baby: నటి త్రిష కృష్ణన్‌పై ట్రోల్స్.. కారణం ఏంటంటే?

'ఆయన కొడుకు వచ్చాడని చెప్పు' ... మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్

Bhairavam Review: భైరవం సినిమా ఎలా ఉందో తెలుసా..!

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments