Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సారీ చెప్పిన వెస్ట్ బెంగాల్ సీఎం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (19:54 IST)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ తరపున సారీ చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న అఖిల్ గిరి ఆదివారం బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తూ, రాష్ట్రపతి ముర్ము రూపాన్ని ప్రస్తావించారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, ముర్ము సొంత రాష్ట్రంలో ఒరిస్సాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని, అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరపున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తమ పార్టీ నేతలతో పాటు మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. అలాగే, మంత్రి అఖిల్ గిరి కూడా రాష్ట్రపతికి సారీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments