Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సారీ చెప్పిన వెస్ట్ బెంగాల్ సీఎం

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (19:54 IST)
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ తరపున సారీ చెబుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 
 
మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా కొనసాగుతున్న అఖిల్ గిరి ఆదివారం బీజేపీ నేతలను ఉద్దేశించి విమర్శలు చేస్తూ, రాష్ట్రపతి ముర్ము రూపాన్ని ప్రస్తావించారు. అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, ముర్ము సొంత రాష్ట్రంలో ఒరిస్సాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. 
 
ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి ముర్ముపై తమకు ఎనలేని గౌరవం ఉందని, అయినా ఏ ఒక్కరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని ఆమె అన్నారు. తమ పార్టీ తరపున ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా జాగ్రత్త పడాలని ఆమె తమ పార్టీ నేతలతో పాటు మంత్రివర్గ సహచరులను హెచ్చరించారు. అలాగే, మంత్రి అఖిల్ గిరి కూడా రాష్ట్రపతికి సారీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

Sumaya Reddy: గుడిలో కన్నా హాస్పిటల్‌లో ప్రార్థనలే ఎక్కువ.. అంటూ ఆసక్తిగా డియర్ ఉమ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments