Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికపై అత్యాచారం చేసి.. ప్రైవేట్ భాగాలు కోసేసిన కామాంధులు

Webdunia
సోమవారం, 14 నవంబరు 2022 (17:20 IST)
బీహార్ రాష్ట్రంలో అమానవీయ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కొందరు కామాంధులు ఆ తర్వాత ఆ బాలిక ప్రైవేట్ భాగాలు, నాలుకను కోసేశారు. ప్రస్తుతం ఈ బాలిక పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఈ దారుణం ఈ నెల 11వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
బీహార్ రాష్ట్రంలోని కళ్యాణ్‌పూర్‌కు చెందిన ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికను కొందరు దుండగులు పక్కనే ఉన్న ఓ తోటలోకి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమ కామవాంఛ తీర్చుకున్న తర్వాత ఆ బాలిక ప్రైవేటు భాగాలతో పాటు నాలుకను విచక్షణారహితంగా కోసివేసి, అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఆ బాలికకు రక్తస్రావం కావడంతో అపస్మారకస్థితిలోకి జారుకుంది. అయితే, ఆ బాలికను గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీపీఐ ఎంఎల్ నేతలు బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితులను పోలీసులు తక్షణం అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కొత్త ఆరంభం' అంటున్న గాయకుడు రాహుల్ సిప్లిగంజ్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం