Webdunia - Bharat's app for daily news and videos

Install App

జి-20 సదస్సు : కాంగ్రెస్ అధినేతకు దక్కని రాష్ట్రపతి విందు ఆహ్వానం

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (13:10 IST)
ఢిల్లీ వేదికగా జి20 సదస్సు జరుగనుంది. ఈ సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. మొత్తం 19 దేశాలకు చెందిన అతిథులు ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ క్రమలో అతిథులతో పాటు మాజీ ప్రధానులకు జీ20 భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ఆహ్వానాలు పంపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆ పార్టీ వృద్ధ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు మాత్రం ఈ ఆహ్వానం అందలేదు. ఈ విషయాన్ని ఖర్గే కార్యాలయం ధ్రువీకరించింది. 
 
ఇందులో కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భారత ప్రభుత్వ కార్యదర్శులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ విందు ఆహ్వానితులు, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతకు ఆహ్వానం అందలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిలో భాగంగానే కేబినెట్‌ హోదా కలిగిన రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన ఖర్గేకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. 
 
మరోవైపు, ఈ విందులో పాల్గొనబోతున్నట్టు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన నీతీశ్‌ కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్, ఎంకే స్టాలిన్ వెల్లడించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో ఈ విందు జరగనుంది. దీంతోపాటుగా  సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments