Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బజరంగ్ దళ్ పరువు నష్టం దావా : మల్లికార్జున ఖర్గేకు నోటీసు

malli kharjuna kharge
, మంగళవారం, 16 మే 2023 (11:13 IST)
బజరంగ్ దళ్ పరువు నష్టం దావా కేసులో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ కోర్టు నోటీసులు జారీచేసింది. బజరంగ్ దళ్ అనుబంధంగా ఉన్న హిందూ సురక్షా పరిషత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది.
 
బజరంగ్ దళ్‌ను నిషేధిత సంస్థ పీఎఫ్ఐతో మల్లికార్జున ఖర్గే ఇటీవల పోల్చారు. దీనిపై హిందూ సురక్షా పరిషత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయనపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. వచ్చే నెల పదో తేదీలోపు సమాధానం ఇవ్వాలని మల్లికార్జున ఖర్గేను ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

CBSE 10th బోర్డ్ పరీక్షలు.. ఆ టాపర్ ఎవరో తెలుసా.. యాసిడ్ దాడి జరిగినా..?