శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...

ఠాగూర్
గురువారం, 9 అక్టోబరు 2025 (16:26 IST)
శ్మశానంలో దొంగలుపడ్డారు. వీరు మనిషి పుర్రె (కపాలం)ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలోని జల్‌గావ్‌ శ్మశానవాటికలో జరిగింది. చితిలో గాలించి మరీ కపాలం ఎత్తుకెళ్లారు. ముందురోజు సాయంత్రం ఓ వృద్ధురాలి మృతదేహాన్ని ఒంటిపై ఉన్న నగలను తీయకుండా ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొందరు దొంగలు ఈ దారుణానికి పాల్పడ్డారు. తులం బంగారం కోసం ఇంతటి దారుణానికి ఒడిగట్టడం విస్మయం కలిగిస్తోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జల్‌గావ్‌కు చెందిన ఛాబాబాయి కాశీనాథ్ పాటిల్ అనే వృద్ధురాలు ఈ నెల 5వ తేదీన మరణించింది. అంత్యక్రియలను కుటుంబ సభ్యులు సోమవారం నిర్వహించారు. ఛాబాబాయి చివరి కోరిక మేరకు ఆమె ఒంటిపై ఉన్న నగలను అలానే ఉంచి దహనం చేశారు. 
 
మరుసటి రోజు అంటే మంగళవారం అస్థికల కోసం శ్మశానం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు అక్కడి పరిస్థితి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. చితిలోని బూడిద చిందరవందరంగా పడివుండగా ఎముకలు, కపాలంలు మాత్రం కనిపించకుండా పోయాయి. దీంతో ఛాబాబాయి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బంగారం కోసమే దొంగలు ఛాబాబాయి కపాలం, ఎముకలను ఎత్తుకెళ్ళివుంటారని వారు ఆరోపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments