Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవేపై రోడ్డు ప్రమాదం - 13 మంది మృత్యువాత

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (16:26 IST)
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
 
టిప్పర్‌పై కూర్చున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు. టిప్పర్ ఐరన్ లోడుతో ప్రయాణిస్తుండగా, కూలీలు ఐరన్ లోడుపై కూర్చున్నారు. వారందరూ సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 
 
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments