Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెల్లితో అక్రమం సంబంధం : వ్యక్తిని హతమార్చిన సోదరులు

చెల్లితో అక్రమం సంబంధం : వ్యక్తిని హతమార్చిన సోదరులు
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:00 IST)
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం జరిగింది. పెళ్లీడుకొచ్చిన తమ చెల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అక్కసుతో ఇద్దరు సోదరులు కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నాగపూర్ నగరంలోని కపిల్ నగర్ గడ్డిగోడం ప్రాంతానికి చెందిన కమలేష్ బందు సహారే అనే వ్యక్తికి వివాహమైంది. కానీ, ఆయన్ను భార్య వదిలేసింది. దీంతో కమలేష్ కుమార్తె, తల్లిదండ్రులతో కలిసి నివశిస్తున్నాడు. 
 
ఈ క్రమంలో మహదా కాలనీలోని టీనేజ్ యువతితో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమం సంబంధానికి దారితీసింది. తనతో పలికే అమ్మాయికి కమలేష్ మొబైల్ ఫోన్ కూడా బహుమతిగా ఇచ్చాడు. తల్లిదండ్రులు వివాహితుడితో సంబంధం పెట్టుకోవడం తెలిసి మందలించారు. 
 
ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా కమలేశ్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు. రెండు వారాల పాటు జైలులో ఉన్న కమలేశ్ విడుదలై, ఆ యువతితో మాట్లాడసాగాడు. 
 
దీంతో ఆగ్రహించిన బాలిక సోదరులిద్దరూ వారి స్నేహితులతో కలిసి కమలేశ్‌ను పట్టుకొని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు బాలిక సోదరులపై ఐపీసీ సెక్షన్ 302, 34 ప్రకారం కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్ట్‌మ్యాన్‌కు ఫోన్ కొట్టండి.. ఆధార్ లింకు చేసుకోండి..