Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో మరో సాధువు హత్య.. 40 రోజుల్లో రెండో మర్డర్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (17:33 IST)
శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ కూటమి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో మరో సాధువు హత్యకు గురయ్యాడు. ఈ రాష్ట్రంలో గత 40 రోజుల్లో సాధువులు హత్యకు గురికావడం ఇది రెండో ఘటన. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, నాందేడ్‌ జిల్లాలోని ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు. ఇద్దరి మృత దేహాలూ స్నానాల గదిలో పడేశారు. ఇద్దరినీ గొంతుకోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ హత్యల తర్వాత డబ్బు, బంగారం దోచుకుని పారిపోతుండగా హంతకుడిని స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే హంతకుడు దొరక్కుండా పారిపోయాడు. హత్యకు గురైన ఆశ్రమంలోనే శివచార్య చాలా కాలంగా ఉంటున్నారని భక్తులు తెలిపారు.   
 
కాగా, గత నెల 16వ తేదీన పాల్‌ఘర్‌‌లో వంద మందికి పైగా సాయుధులు ఇద్దరు సాధువులపై సామూహిక దాడి చేసి చంపేశారు. ఇంతలోనే మహారాష్ట్రలో మరో సాధువు హత్య జరగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఉద్ధవ్ పాలనలో సాధువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే హంతకులను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments