Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో మరో సాధువు హత్య.. 40 రోజుల్లో రెండో మర్డర్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (17:33 IST)
శివసేన - ఎన్సీపీ - కాంగ్రెస్ కూటమి పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో మరో సాధువు హత్యకు గురయ్యాడు. ఈ రాష్ట్రంలో గత 40 రోజుల్లో సాధువులు హత్యకు గురికావడం ఇది రెండో ఘటన. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే, నాందేడ్‌ జిల్లాలోని ఆశ్రమంలో శివాచార్య అనే సాధువుతో పాటు భగవాన్‌ షిండే అనే మరో వ్యక్తిని కూడా హత్య చేశారు. ఇద్దరి మృత దేహాలూ స్నానాల గదిలో పడేశారు. ఇద్దరినీ గొంతుకోసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఈ హత్యల తర్వాత డబ్బు, బంగారం దోచుకుని పారిపోతుండగా హంతకుడిని స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే హంతకుడు దొరక్కుండా పారిపోయాడు. హత్యకు గురైన ఆశ్రమంలోనే శివచార్య చాలా కాలంగా ఉంటున్నారని భక్తులు తెలిపారు.   
 
కాగా, గత నెల 16వ తేదీన పాల్‌ఘర్‌‌లో వంద మందికి పైగా సాయుధులు ఇద్దరు సాధువులపై సామూహిక దాడి చేసి చంపేశారు. ఇంతలోనే మహారాష్ట్రలో మరో సాధువు హత్య జరగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఉద్ధవ్ పాలనలో సాధువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వెంటనే హంతకులను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments